పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్ అలాగే దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో కూడా అదరగొడుతుంది.  అయితే ఈ చిత్రం నుంచి ఎప్పటికప్పుడు షూట్ మధ్యలో కొన్ని మూమెంట్స్ ని అయితే పలువురు నటీనటులపై షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈసారి కూడా కొన్ని పిక్స్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. మరి లేటెస్ట్ గా వచ్చిన పిక్స్ లో చూస్తే ప్రభాస్ నాగ్ అశ్విన్ ల మధ్య ఓ సీరియస్ డిస్కషన్ నే సెట్స్ లో

 నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనితో ఈ పిక్స్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. ఇక ఈ భారీ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన తదితరులు నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.  ఇక ఈ సినిమా తరువాత  ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో రాజా సాబ్ పై సూపర్ హైప్ ఉంది. మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్‌లో

 ప్రభాస్ లుక్ కేక పెట్టించేలా ఉంది. ఈ నేపథ్యంలో.. రాజా సాబ్ ఆడియో హక్కులకు సంబంధించి కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఆడియో హక్కులు 15 కోట్లకు అమ్ముడు పోయినట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ప్రముఖ నిర్మాత, మారుతీ ఫ్రెండ్ అయినటువంటి ఎస్‌కెఎన్ సోషల్ మీడియాలో.. రాజా సాబ్ ఆడియో రైట్స్ పై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ న్యూస్ నిజమా? కాదా? అని ఎస్‌కెఎన్‌ను ట్యాగ్ చేయగా.. ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. దీంతో.. రాజా సాబ్ ఆడియో రైట్స్ పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నమాట. ఇకపోతే.. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే.. హనురాఘవపూడి ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ప్రభాస్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: