టాలీవుడ్ న‌టుడు రాజ్ తరుణ్‌పై తాజాగా ఛార్జ్‌షీట్‌ దాఖలు అయింది. రాజ్ తరుణ్ త‌న‌ని మోసం చేశాడంటూ అత‌ని ప్రేయ‌సి లావణ్య పోలీసుల‌కు కంప్ల‌యింట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. రాజ్‌ తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కొత్త మ‌లుపు తీసుకుంది. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న పోలీసులు రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చి, ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. రాజ్ త‌రుణ్ – లావ‌ణ్య క‌లిసి ప‌దేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని.. లావ‌ణ్య చెబుతున్న ఆరోప‌ణ‌ల్లో నిజం ఉన్న‌ట్లు దానికి సంబంధించి ఆమె

 ఇంటి వద్ద సాక్ష్యాలు కూడా సేకరించామని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తెలిపారు. ఈ కేసు విషయంలో లావణ్య చెప్తున్నదాంట్లో వాస్తవాలు ఉన్నాయని నార్సింగి పోలీసులు నిర్ధారించారు.  లావణ్య తాజాగా  మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. లావణ్య ఒక డ్రగ్స్ అమ్మే వ్యక్తి, లావణ్య చాలామంది వ్యక్తులతో అఫైర్ లో ఉంది అని రాజ్ తరుణ్ చెప్పిన సందర్భాలు చూశాం కదా అంటే నేను డ్రగ్ అమ్ముతానని రాజ్ తరుణ్ ఎప్పుడూ చెప్పలేదని ఆమె కామెంట్ చేసింది. అంతేకాదు శేఖర్ బాషా వలన నా క్యారెక్టర్ కి బ్యాడ్ జరిగింది, డ్యామేజ్ జరిగింది నాకు. ఈ డ్యామేజ్ జరిగింది కదా అని బంధాన్ని

 వదులుకోవాలంటే ఎన్ని బంధాలు నిలవ గలవు అని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు రాజ్ తరుణ్, తాను కలిసి డ్రగ్స్ తీసుకున్నామని లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేంటి నిజంగానే రాజ్ తరుణ్ డ్రగ్స్ తీసుకున్నాడా అంటే నేను డ్రగ్స్ తీసుకున్నానని రాజ్ తరుణ్ అంటే కనుక మేమిద్దరం కలిసి తీసుకున్నట్లే అని ఆమె అన్నారు. అయితే దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే అసలు మేము చేయలేదు. దానికి సంబంధించి ఆధారాలు కూడా లేవని ఆమె అన్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: