హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తనకు కావాలని లావణ్య చెబుతోంది. మరోవైపు పోలీసులు ఈ కేసులో రాజ్ తరుణ్‌ నిందితుడేనని చెబుతున్నారు. రాజ్ తరుణ్, లావణ్య పదేళ్ల పాటు సహ జీవనం చేశారని కూడా పోలీసులు చెబుతున్నారు. రాజ్‌తరుణ్-లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు. పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని చార్జిషీట్‌లో తెలిపారు. లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు

 తెలిపారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. అయితే ఈ విషయమై ఏబీఎన్‌తో లావణ్య మాట్లాడుతూ.. రాజ్ తరుణ్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం శుభ పరిణామమని తెలిపింది. తనను ఎన్నో మాటలు అన్నారని.. చివరికి న్యాయం గెలుస్తుందని తాను భావిస్తున్నానని పేర్కొంది. ఈ సమయంలో మీరు గతంలో రాజ్ తరుణ్ కి పలువురు హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నాయని మీడియా ముందే కామెంట్ చేశారు అవి నిజమేనా అని అడిగితే అవును నిజమేనని లావణ్య చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ మాత్రం వాళ్లు తన సహ నటులు మాత్రమే అని

 చెబుతున్నారు దీనికి ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వగలరా అని అడిగితే ఖచ్చితంగా అతనికి అఫైర్స్ ఉన్నాయని నాకు తెలుసు. కానీ అతనిని వదులుకోవాలని నేను ఏ రోజు అనుకోలేదు. కొట్టుకుంటాము, తిట్టుకుంటాము కానీ కలిసి ఉంటామని అనుకునేదాన్ని. ఆయనకు లవర్ సినిమా హీరోయిన్ రిద్దీ, అరియనా, శాలిని పాండే సహా ఇంకో ఇద్దరితో అఫైర్స్ ఉన్నాయని ఆమె అన్నారు.హెబ్బా పటేల్ పేరు చెప్పానా, అవికా గోర్ పేరు చెప్పానా భలే ఉన్నాడే సినిమా హీరోయిన్ పేరు చెప్పానా? లేక పురుషోత్తముడు సినిమా హీరోయిన్ పేరు చెప్పానా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని అడిగితే నా దగ్గర ఉన్న ఆధారాలను మీడియాకి కూడా ఇచ్చాను అని అన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: