పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి.... అతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ సినిమా తర్వాత బాహుబలి 2 సినిమా ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచేసింది.


సినిమా అనంతరం ప్రభాస్ చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. అయితే మొదటగా ప్రభాస్ కు మంచి స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా ఏది అంటే ప్రతి ఒక్కరూ చెప్పే పేరు వర్షం. ఈ సినిమాకు ఎంఎస్ రాజు నిర్మాతగా వ్యవహరించగా.... శోభన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా వసూళ్ల పరంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో ప్రభాస్, త్రిష కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే మొదటగా ఈ సినిమాలో ప్రభాస్ కన్నా ముందుగా మరొక హీరోని అనుకున్నారట. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు అని సమాచారం. దర్శకుడు శోభన్ ఈ సినిమా కథను ముందుగా మహేష్ బాబు కోసం సిద్ధం చేసుకున్నారట. అయితే శోభన్ ఈ కథను మహేష్ బాబుకు వివరించగా అతను సున్నితంగా తిరస్కరించారట.

సినిమా స్టోరీ విన్న మహేష్ బాబు దీనికి నేను సెట్ కాను అని సున్నితంగా రిజెక్ట్ చేశారు. దాంతో ఈ సినిమా కథను ప్రభాస్ కు వినిపించగా వెంటనే ఓకే చెప్పాడట. ఇక ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించి ఎంతగానో మెప్పించారు. ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో వర్షం సినిమా ఒకటి. ఈ సినిమా అనంతరం ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులు అయ్యారు. ఇప్పటికీ వారి ఫ్రెండ్షిప్ అలానే కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: