రాజ్ తరుణ్, లావణ్య కేసు ఊహించని మలుపు తిరిగింది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఇద్దరినీ లావణ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముంబైలో ఓ ఇంట్లో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో కలిసి ఉంటున్నాడు. వీరిద్దరూ రహస్యంగా ఉంటున్నారని సమాచారంతో అక్కడికి వెళ్లిన లావణ్య ఇద్దర్నీ పట్టుకుంది.  అనంతరం మాల్వీ తో తో దూషణకు దిగింది. తనని మోసం చేసి హీరోయిన్ మాల్వీ తో సహజీవనం చేస్తున్నాడు అంటూ రాజ్ తరుణ్ పై లావణ్య ఆరోపణలు చేసింది. నా రాజ్ ను నాకు అప్పగించాలని మాల్వితో గొడవకు కూడా దిగింది. కాగా ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య కేసులో నార్సింగి పోలీసులు ఛార్జ్ షీట్

 దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు.  కేసు ఛార్జ్ షీట్ లావణ్యకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో ఆమె ఎన్టీవీతో మాట్లాడింది. అసలు శేఖర్ భాషాతో మీకు ఉన్న గొడవ ఏంటి అతను మీడియా ముందుకు వచ్చి లావణ్యకు చాలా మంది అబ్బాయిలతో అఫైర్ ఉందని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అని అడగగా.. అతను మగజాతి ఆణిముత్యాన్ని అని చెప్పుకుంటున్నాడు. అలా అయితే మగజాతి ఆణిముత్యాల కోసం ఫైట్ చేయాలి కదా. శేఖర్ బాషా నాతో సంసారం చేసిన మగాడిలాగా మూడు సంవత్సరాలు ఉన్నాడు, రెండు సంవత్సరాలు

 ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. మరి పోలీసులు చెప్పారు కదా చార్జ్ షీట్ వేశారు.  నేను చెప్పినప్పుడు పదేళ్లు పైగా కాపురం చేసాం అని చెబితే ఎవరైనా నా మాట విన్నారా? అతను సొంత మైలేజ్ కోసం బిగ్ బాస్ కి వెళ్లడం కోసం చేసిన డ్రామా ఇదంతా.. అతనికి పెళ్లయింది, ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. నేను అతనికి ఆడదానిలా కనిపించలేదా? అతనికి నేను ఒక మనిషిలా కూడా కనిపించలేదా? అతను సొంతదారులు చూసుకుని వెళుతున్నప్పుడు కళ్ళతో చూసినట్టు మాట్లాడేసాడు. శేఖర్ బాషా మీరు మాట్లాడుతున్నది తప్పు, మీరు ఎందుకు జడ్జి చేస్తున్నారు అని నేను ఫోన్ చేసి మాట్లాడిన రోజున నువ్వు ఆ ఇల్లు ఖాళీ చేసేయ్ అంటాడు. నేను 11 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న ఇల్లు అది. ఆ ఇల్లు నాది, అని ఆమె అన్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: