గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే హీరోయిన్ అంజలి ఫీమేల్ లీడ్ లో మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎప్పుడు నుంచో అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా ఇటీవల ఈ వినాయక చవితి కానుకగా ఓ అప్డేట్ అయితే చిత్ర యూనిట్ నుంచి రావచ్చని బజ్ వైరల్ గా మారింది.మరి ఫైనల్ గా ఇప్పుడు అభిమానులు కోరుకుంటున్న అఫీషియల్ క్లారిటీ అయితే వచ్చేసింది. మరి దీనిపై లేటెస్ట్ గా సంగీత దర్శకుడు థమన్ పోస్ట్ వైరల్ గా మారింది గేమ్ ఛేంజర్ అంటూ వినాయక చవితికి టార్గెట్ పెట్టునట్టుగా

 ప్రకటించాడు.  ఇప్పుడు దీనికోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా సినిమా రిలీజ్ కి రాబోతుంది.  అసలు గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటి వరకు.. ఒకటి రెండు పోస్టర్స్‌, టైటిల్‌తో పాటు ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో.. గతంలోనే గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కావాలని నెగిటివ్ ట్రెండ్ చేశారు ఫ్యాన్స్. కానీ ఈ సారి మాత్రం మేకర్స్‌కు గట్టిగానే ఇచ్చుకున్నారు. మాటల్లో చెప్పలేని, రాతల్లో రాయలేని విధంగా శంకర్‌తో పాటు నిర్మాణ సంస్థపై నెగెటివ్ ట్యాగ్స్‌ ట్రెండ్ చేస్తూ.. లిటరల్ గా చెప్పాలంటే బూతులు తిడుతూ పోస్టులు పెట్టారు. ‘అసభ్యకర కామెంట్లు,

 నెగిటివిటీని ట్రెండ్ చేస్తే ఉపయోగం ఏంటి? దాని వల్ల సినిమా ఇమేజ్ దెబ్బతింటుంది.. బ్యాడ్ కామెంట్స్ మమ్మల్ని బాధ పెడతాయి.. ఈ నెలలోనే అప్డేట్ ఉంటుంది..’ అంటూ  పోస్ట్  చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ‘గేమ్ ఛేంజర్.. హ్యాపీ వినాయక చవితి 2024’ అంటూ  పోస్ట్  చేశాడు తమన్. దీనికి సై అన్నట్టు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒక ఎమోజీతో రిప్లై ఇచ్చింది. అంటే.. సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా.. గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుందని కన్ఫామ్ అయిందన్నమాట. అయితే.. ఫ్యాన్స్ అడిగినట్టుగా గేమ్ ఛేంజర్ టీజర్ ఏమైనా రిలీజ్ చేస్తారా? లేదంటే కొత్త పోస్టర్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: