టాలీవుడ్‌ యువ హీరో సిద్దు జొన్నల గడ్డ ఈ ఏడాది టిల్లు 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడని తెలిసిందే. ప్రస్తుతం పాపులర్‌ స్క్రీన్‌ రైటర్‌ కోన వెంకట్‌ సోదరి నీరజ కోన  డైరెక్షన్‌లో తెలుసు కదా   సినిమాలో నటిస్తున్నాడు.. ఈ మూవీలో రాశీఖన్నా  ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది.  టిల్లు స్క్వేర్ మంచి హిట్ కావడంతో టిల్లు క్యూబ్ ను అనౌన్స్ చేశారు. అందుకు సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం జాక్- కొంచెం క్రాక్ మూవీ చేస్తున్నారు. ఆ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధుకు జోడీగా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుండగా.. SVCC బ్యానర్‌పై

 BVSN ప్రసాద్, బాపినీడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న జాక్ మూవీ మేకర్స్.. తాజాగా స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు. హైదరాబాద్ లో ప్రజెంట్ షూటింగ్ జరుగుతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నేపాల్ కు వెళ్లనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నేపాల్ లో స్టార్ట్ కానున్న కొత్త షెడ్యూల్ తో 80 శాతం షూటింగ్ పూర్తి కానుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో సిద్ధు జొన్నలగడ్డ, ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ, వైష్ణవి చైతన్యపై ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు

 తెలిపారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు చెప్పారు. సంగీత దర్శకుడు అచ్చు రాజమణి మ్యూజికల్ వర్క్ ను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలవుండగా తాజాగా  సిద్దు జొన్నలగడ్డ గొప్ప మనసు చాటుకున్నాడు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు డీజే టీల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ. తెలుగు రాష్ట్రాలకు రూ.30 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు డీజే టీల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వరద బాధితులకు ఆర్థిక సాయం డీజే టీల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ పై ప్రశంసలు కురుస్తున్నాయి. యంగ్‌ హీరో అయినప్పటికీ.. సాయం చేశాడని అతను గొప్పొడు అంటున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరి కంటే ముందు తన ఉదారత స్వభావాన్ని చాటుకున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: