జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమ్మ కోరిక తీరుస్తూనే.. తన సినిమా పనులు కంప్లీట్ చేసుకుంటున్నాడు. పర్సనల్, ప్రొఫెషనల్ వర్క్స్ తారక్ ఒకేసారి పూర్తి చేస్తూ అందరినీ సంతృప్తి పరుస్తున్నాడు. దేవర సినిమా కంప్లీట్ అయిపోయింది అందువల్ల ఇప్పుడు నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశాడు. దేవర ప్రమోషన్స్, వార్ 2తో తారక్ కొద్దిగా బిజీగా కూడా ఉన్నాడు. రీసెంట్ గానే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా కూడా పట్టాలెక్కింది. ఆర్‌ఆర్ఆర్ రిలీజ్ కు ముందే నీల్ - తారక్ సినిమాపై చాలా రోజుల క్రితమే అనౌన్స్మెంట్ వచ్చినా దాన్ని వెంటనే స్టార్ట్ చేయలేదు. ఆగస్ట్‌లో చిన్న చిన్న వరుస మొదలుపెట్టారు. సలార్ 2 కంటే ముందే ఈ ప్రాజెక్ట్‌ను కంప్లీట్ చేస్తే ఒక పని అయిపోతుందని ప్రశాంత్ నీల్ ఆలోచిస్తున్నాడట.

 కథ కూడా త్వరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ కు పూర్తి సహకారం అందిస్తున్నాడు తారక్. కర్ణాటక ట్రిప్‌లో ఉన్నాడి హీరో. అక్కడే నివసించే ప్రశాంత్ నీల్ తో కలిసి సినిమా వర్క్ కంప్లీట్ కూడా చేస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్‌ మూవీ పూర్తి చేసే పనిలో పడ్డాడు. హను రాఘవపూడి సినిమా కూడా సలార్ 2కి ముందే పూర్తి చేస్తానని చెప్పాడు. అందుకే ప్రశాంత్‌ నిల్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

దేవర 2, ప్రశాంత్ నీల్ సినిమాను ఏకబిగిన పూర్తి చేస్తే మరో సినిమాకి వెళ్లిపోవచ్చని తారక్ అనుకుంటున్నాడు. తారక్-ప్రశాంత్ మూవీ 2026, జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజులుగా రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్‌తోనే గడుపుతున్నారు. కుటుంబంతో కలిసి కర్ణాటకలోని దేవాలయాలు విజిట్ చేస్తున్నాడు. తారక్ ఫ్యామిలీతో కలిసి రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీస్ కూడా దేవాలయాలను సందర్శిస్తున్నాయి.

వారి కర్ణాటక ట్రిప్పుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ట్రిప్‌లోనే ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ సైతం కంప్లీట్ చేస్తున్నారు ఎన్టీఆర్, నీల్. అంతా ఓకే అయితే వీళ్ళ సినిమా 2025 ఫస్టాఫ్‌లో సినిమా సెట్స్‌పైకి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: