టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన మ్యాడ్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు . ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఆయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇకపోతే నార్ని నితిన్ "మ్యాడ్" మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈయన మొదటగా శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాను మొదలు పెట్టాడు.

మూవీ కి శతమానం మూవీ దర్శకుడు అయినటువంటి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. సంపదమూవీ లో నార్నీ నితిన్ కి జోడిగా నటిస్తోంది. ఈ మూవీ ని శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ హీరో అయినటువంటి నార్ని నితిన్ ఈ సినిమా విడుదల కావడం కష్టం అని చెప్పుకొచ్చాడు. కానీ ఈ మూవీ నిర్మాత మాత్రం ఈ సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించాడు.

ఈ సందర్భంగా ఈ మూవీ నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ ... మొదటగా మమ్మల్ని మా బ్యానర్ ని ఆదరిస్తున్న అఖిలాంధ్ర ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మా సినిమా హీరో అయినటువంటి నార్నీ నితిన్ వరుస విజయాలతో ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇక మా సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయబోతున్నాం. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం అందుకుంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఈ మూవీ నిర్మాత తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: