తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పటాస్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత ఈ దర్శకుడు అనేక సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో ప్రతి సినిమా కూడా అద్భుతమైన విజయం అందుకుంది. దానితో ఈయన ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం అనిల్ రావిపూడి , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సరిలేరు నీకెవ్వరు అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు.

ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. అనిల్ , సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ హీరో ఉన్నా కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నింటినీ ముందే పూర్తి చేసి సినిమా షూటింగ్ను మొదలు పెట్టాడు.  జెట్ స్పీడ్ లో మూవీ ని పూర్తి చేసి సంక్రాంతి పండుగకు విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అనిల్ , వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ఓ మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

ఇక అనిల్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా చాలా రోజులు చేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. జెట్ స్పీడ్ లో ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అవుతూ వస్తుంది. మరి ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనూ , షూటింగ్ విషయంలోనూ సరిలేరు నీకెవ్వరు సినిమాను ఫాలో అవుతున్న అనిల్ కి ఆ సినిమా లాంటి విజయమే అనే వెంకటేష్ మూవీ తో దక్కుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: