పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా రూపొందిన ఉప్పెన మూవీ తో బుచ్చిబాబు సనా దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించాడు. ఇక దర్శకత్వం వహించిన మొదటి సినిమానే బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. బుచ్చిబాబు తన రెండవ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ లో జాన్వీ కపూర్ , చరణ్ కి జోడిగా కనిపించబోతుంది. వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనుండగా ... కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం బుచ్చిబాబు చాలా బిజీగా ఉన్నాడు. మరి కొంత కాలం లోనే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బుచ్చిబాబు ఈ సినిమాలోకి మరో స్టార్ నటుడిని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సంజయ్ దత్ ను ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో తీసుకోవాలి అని బుచ్చిబాబు అనుకుంటున్నట్లు , అందులో భాగంగా ఈయనతో ప్రస్తుతం సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు అన్ని ఓకే అయితే చరణ్ , బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో సంజయ్ దత్ ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: