తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాల పాటు స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగించిన వారిలో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఈయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో అనేక మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. కృష్ణారెడ్డి కెరియర్ లో ఎక్కువ శాతం చిన్న హీరోలతో , మీడియం రేంజ్ హీరోలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు. స్టార్ హీరోలతో కృష్ణా రెడ్డి కి పెద్దగా విజయాలు లేవు. కృష్ణా రెడ్డి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణ తో టాప్ హీరో అనే మూవీ ని రూపొందించగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక తెలుగులో మరో స్టార్ హీరో అయినటువంటి నాగార్జున తో ఎస్వీ కృష్ణా రెడ్డి "వజ్రం" అనే మూవీని రూపొందించాడు.

సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయకపోవడానికి గల కారణాలను వివరించాడు. తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ... చిరంజీవి తో సినిమా చేయాలి అనుకున్నాను. అందులో భాగంగా ఆయనను కలిసాను ... కథ కూడా వివరించాను.

కథ మొత్తం విన్న చిరంజీవి కథ సూపర్ గా ఉంది. కాకపోతే మరి అడ్వాన్సుడ్ గా ఉన్నట్లుగా ఉంది కదా అని అన్నాడు. అలాగే ఉంటుంది సార్. మీలాంటి హీరోతో నాలాంటి దర్శకుడు తీస్తే ఆమాత్రం అడ్వాన్స్ గా లేకపోతే ప్రేక్షకులకు నచ్చదు సార్ అని చెప్పాను. ఓకే ఆలోచిద్దాం అని అన్నాడు. కానీ ఆ తర్వాత చిరంజీవి దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అందుకే చిరంజీవి తో సినిమా రాలేదు అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఎస్ వి కృష్ణారెడ్డి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: