స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తల్లయినట్టు ఇప్పటికే పలు రూమర్లు వినిపించాయి. దీపికా లండన్ లో డెలివరీ అయ్యి  పండంటి బాబుకు జన్మనిచ్చిందని ఇలా ఎన్నో రూమర్లు బీటౌన్ లో చక్కర్లు కొట్టాయి.కానీ ఆ రూమర్లన్నింటికి తెరపడేలా దీపిక తన బేబీ బంప్ ఫోటోస్ ని షేర్ చేసింది. అంతేకాకుండా రీసెంట్ గా ముంబైలో ఫేమస్ టెంపుల్ అయినటువంటి సిద్ధి వినాయక టెంపుల్ కి భర్తతో కలిసి వెళ్ళింది. ఇక ఆ గుడికి వెళ్ళిన సమయంలో సాంప్రదాయ బద్ధంగా ఆకుపచ్చ రంగులో ఉండే బనారస్ శారీలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ని చూడడానికి ఎంతోమంది అభిమానులు తరలివచ్చారు. అయితే తాజాగా దీపిక పదుకొనే డెలివరీ అయిందని తెలుస్తోంది. డెలివరీకి ముందు రోజు ఆమె సిద్ధి వినాయకుడి టెంపుల్ లో వినాయకుడి ఆశీర్వాదాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో దీపికా పదుకొనే అడ్మిట్ అయిందట. తాజాగా దీపిక పదుకొనేకి పండంటి ఆడబిడ్డ పుట్టినట్లు ముంబై వైద్యులు చెప్పారు. అంతేకాకుండా దీపిక పదుకొనే, ఆ పాప ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కూడా వైద్యులు తెలియజేశారు. అయితే దీపిక పదుకొనేకి ఆడబిడ్డ పుట్టింది అని తెలియగానే చాలామంది ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకి కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా దీపిక పదుకొనేకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 అయితే దీపికకు పాప పుట్టడంతో చాలామంది నెటిజన్స్ గతంలో ఓ స్వామిజి చెప్పిన విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఓ స్వామీజీ దీపిక పదుకొనేకి కచ్చితంగా మగ బిడ్డే పుడతాడని, ఆమె జాతకం ప్రకారం దీపికకు పుట్టేది మగ బిడ్డే అంటూ చెప్పారు. అయితే ప్రస్తుతం దీపిక ప్రసవించడంతో ఆమెకు ఆడబిడ్డ పుట్టింది.దీంతో మగ బిడ్డ పుడతాడు అని చెప్పిన ఆ స్వామీజీని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: