మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, కియారా అద్వానీ కథానాయికగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రమే గేమ్ ఛేంజర్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ సగం జరిగిన తర్వాత మధ్యలో వదిలేసి దర్శకుడు శంకర్ భారతీయుడు2 చిత్రాన్ని తీశారు. దీనివల్ల ఆలస్యం కావడంతోపాటు ఆయన రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారు. భారతీయుడు2 చిత్రం భారతదేశంలోనే అతి పెద్ద భారీ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో మెగా అభిమానులు గేమ్ ఛేంజర్ పై ఆశలు

 వదిలేసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి కేవలం ఒక పాటనే విడుదల చేశారు. ఈ సినిమాకు అటూ ఇటూగా మొదలుపెట్టిన దేవర ఈనెల 27వ తేదీన విడుదల కాబోతోంది. పుష్ప2 డిసెంబరు ఆరోతేదీన విడుదల కాబోతోంది. దేవరకు గ్రాఫిక్ వర్క్ ఎక్కువ కాబట్టి ఆలస్యమైందనుకోవచ్చు. ఇకపోతే వినాయక చవితి సందర్భంగా ‘గేమ్ చేంజర్’ నుండి ఒక పోస్టర్ ని విడుదల చేసింది మూవీ టీం. శంకర్ కూడా తన ఖాతాలో  నుండి ‘గేమ్ చేంజర్’ పోస్టర్ ని అప్లోడ్ చేసాడు. కానీ ఎదో వెయ్యాలి అన్నట్టుగా వేసినట్టు ఉన్నాడు కానీ, ఆ సినిమాలో పనిచేస్తున్న హీరో రామ్ చరణ్ ని, హీరోయిన్ కియారా అద్వానీ ని, నిర్మాత దిల్ రాజు ని ఇలా

 టీం లో పని చేసిన ఒక్కరిని కూడా ట్యాగ్ చేయకుండా ఈ పోస్టు వేసాడు. కనీసం ‘గేమ్ చేంజర్’ చిత్రం ట్యాగ్ ని కూడా ఉపయోగించలేదు. వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియచేయలేదు. దీంతో అభిమానులు అసహనం కి గురయ్యారు. అసలు గేమ్ చేంజర్ చిత్రం మీద నీకు ఆసక్తి ఉందా?, అంత బలవంతంగా ఈ పోస్ట్ వెయ్యడం కూడా ఎందుకు, డిలీట్ చేసేయ్ అంటూ శంకర్ ని తిడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: