ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటెడ్ కాంబో ఏదైనా ఉంటంటే అది సెన్సెషనల్ డైరెక్టర్ రాజమౌళి- టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుది అని చెప్పవచ్చు. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న క్రేజీ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ చాలా ఇగర్ ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా సస్పెన్స్ కి తెర పడబోతుంది. త్వరలో ఈ కాంబోలో రాబోతున్న మూవీ అనౌన్స్ మెంట్ రాబోతుంది. అటు ప్రిన్స్ మహేష్ బాబు క్రేజ్ కి, సెన్సెషనల్ డైరెక్టర్ రాజమౌళి ఇమేజ్ కు తగ్గట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతోంది. ఇక మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు

 వచ్చాడు. ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా పైనే మహేష్ అభిమానులు అందరూ  ఆశలను పెట్టుకున్నారు. ఇదిలవుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మాత్రమే కాదు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ల్యాండ్ మార్క్ గా నిల్చిన అతి కొద్ది చిత్రాలలో ఒకటి పోకిరి. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాథ్ ఎంతో కసితో రాసిన స్క్రిప్ట్ ఇది. అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఆరోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా 40 కోట్ల రూపాయిల

 షేర్ వసూళ్లను రాబట్టింది అంటే ఏ స్థాయి సంచలన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా పోకిరి చిత్రానికి ఉన్న క్రేజ్ వేరు. తీస్తే పోకిరి లాంటి సినిమా తియ్యాలి రా, పోకిరి క్లైమాక్స్ లాంటి ట్విస్ట్ కావాలి రా అని అంటూ ఉంటారు. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ రోల్ కోసం ముందుగా ఇలియానా ని అనుకోలేదట. మహేష్ త్రిష ని తీసుకుందాం అని పూరి జగన్నాథ్ తో అన్నాడట. ఈ విషయం నమ్రత దాకా వెళ్ళింది. మొన్ననే కదా ‘అతడు’ లో త్రిష తో కలిసి చేసావ్, మళ్ళీ ఆమెతోనే సినిమా అంటే ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ రాదు, దేవదాసు చిత్రంలో ఎంతో క్యూట్ గా కనిపించిన ఇలియానా ని ఈ సినిమా కోసం తీసుకోండి అని సలహా ఇచ్చిందట. భార్య మాట మహేష్ బాబు జవదాటడు, అందుకే ఆమె చెప్పినట్టుగానే త్రిష ని తప్పించి ఇలియానా ని ఈ సినిమా కోసం తీసుకున్నాడు మహేష్ బాబు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: