టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నటనలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అందులో మెగా స్టార్ చిరంజీవి గారి గురించి అయితే స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం సినిమాలతో పాటు పలు యాడ్స్ చేస్తూ అదరహో అనిపిస్తున్నాడు. తాజాగా చిరంజీవికి  సంబంధించిన ఒక యాడ్ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజులో ట్రెండ్ అవుతుంది..ఒకప్పుడు మెగాస్టార్ మూవీ వస్తుందంటే చాలు ముందు రోజు నుంచే టికెట్స్ కోసం ఎగబడేవారు.. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకెళ్తున్నాడు.అంతేకాకుండా, ఇప్పుడున్న యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడనే చెప్పుకోవాలి. అంతకముందు చిరు ఎక్కువ కమర్షియల్ యాడ్స్ లో నటించేవాడు. అప్పట్లో థమ్స్ అప్, నవరతన్ ఆయిల్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. రీ ఎంట్రీ తర్వాత యాడ్స్ పక్కన పెట్టారు. కానీ, తాజాగా ఓ యాడ్ లో చిరు మెరిశారు. వినాయక చవితి సందర్భంగా దీనిని విడుదల చేశారు. ఈ యాడ్ కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. దీని కోసం క్లాస్ అండ్ మాస్ లుక్ లో కనిపించి అభిమానులను అందర్ని అలరించారు. 70 ఏళ్ళు దగ్గర పడుతున్న కూడా అదే గ్రేస్ అదే ఊపు .. కొంచం కూడా తగ్గలేదని ఈ యాడ్ తో నిరూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. మొత్తానికి తాజాగా చిరంజీవి మరో కొత్త యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అందులో భాగంగా టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో చిరంజీవి కంట్రీ డిలైట్అనే పాల యాడ్ చేశారు. యాడ్‌లో కూడా డ్యుయల్ రోల్‌లో నటించి మెప్పించారు. చిరంజీవితో పాటు కమెడియన్ సత్య కూడా నటించారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు ఊరికే మెగాస్టార్ అయిపోరు కదా మినిమమ్ ఉంటది అని, వావ్ లుక్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: