నేచురల్ స్టార్ నాని హీరోగా.. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సినిమానే 'సరిపోదా శనివారం'. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ నటించారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. 'సరిపోదా శనివారం' సినిమాకు నైజాంలో రూ. 12.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 12.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.00 కోట్లు,

 ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లకు అమ్ముడైంది. ఇలా నాని సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో నిన్న సరిపోదా శనివారం సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఇక ఇందులో భాగంగానే నాని తన అభిమాని ఇచ్చిన షర్టుని కూడా ఈ ఈవెంట్లో ధరించాడు. ఒక విధంగా తన అభిమానికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నాడు నాని. ఇదిలవుండగా ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా

 మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో మరోసారి శ్రీకాంత్ ఓదెల మీదనే ఆయన నమ్మకం పెట్టుకొని మరొక మాస్ సినిమాని చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు వచ్చిన దసర సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా నటుడిగా మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇక దర్శకుడి గా శ్రీకాంత్ ఓదెలకు కూడా పలు అవార్డులను కూడా తీసుకొచ్చి పెట్టింది. మరి ఇలాంటి క్రమంలో మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో ఒక మాస్ సినిమా రాబోతుంది అంటూ అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: