తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లుగా వస్తూనే ఉన్నారు. అయితే అందులో కొంతమంది మాత్రమే వారి అందం, నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అలాంటి వారిలో హనీరోజ్ ఒకరు. ఈ బ్యూటీ 2005లో వచ్చిన బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ సినిమాతో నటిగా పరిచయమైంది. కానీ ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా వల్ల అక్కడి ప్రేక్షకులకు హనీరోజ్ డ్రీమ్ గర్ల్ గా మారింది.


బ్యూటీ మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించిన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆలయం అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఎన్నో సినిమాల్లో కీలకపాత్రలో నటించి పేక్షకులను అలరించిన ఈ బ్యూటీ నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబుకు మరదలుగా నటించింది.

దీంతో హనీరోజ్ కు విపరీతంగా క్రేజ్ వచ్చింది. ఆ సినిమా అనంతరం వరుస పెట్టి కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉండగా....ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన హనీరోజ్ త్వరలోనే నిర్మాతగా మారబోతుందట. హనీరోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని తాజాగా హనీరోజ్ తన సోషల్ మీడియా ద్వారా తెలపడం జరిగింది.


ఈ క్రమంలో తన సంస్థ లోగోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. హనీరోజ్ వర్గీస్ ప్రొడ క్షన్స్ లోగో పోస్టర్ తో పాటుగా ఇలా రాసుకోచ్చింది. ఇండస్ట్రీలో సినిమా అనేది చాలామందికి ఒక కల అన్నారు హనీ రోజ్‌. ఒక విజన్, ఒక వెంచర్, అదొక ఫాంటసీ, జీవిత కోరిక అంటూ వ్యాఖ్యానించారు టాలీవుడ్‌ బ్యూటీ హనీరోజ్‌. దీనిని నేను ఓ వరంలా భావిస్తున్నాను అని రాసుకోచ్చింది హనీ. ప్రస్తుతం హనీరోజ్ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: