ప్రస్తుతం మన టాలీవుడ్ లో మరోసారి మల్టీస్టారర్ చిత్రాల పర్వం ఊపందుకున్న సంగతి తెలిసిందే. అలా మన టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా ఒకొక్కరు మరో హీరోలతో సినిమాలు చేసి భారీ సక్సెస్ లు అందుకున్నారు. అయితే లేటెస్ట్ గా మరో క్రేజీ మల్టీస్టారర్ కి బీజం పడినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. అది కూడా నటసింహం బాలకృష్ణ ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో అట..గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇద్దరికీ ఫ్యాన్ బేస్ బలంగా ఉంటుంది. మాస్ సినిమాలకు బాలయ్య కేరాఫ్ కాగా.. మహేశ్ ఎక్కువగా క్లాసీ క్యారెక్టర్లు చేస్తుంటారు. ఒకవేళ ఈ ఇద్దరు కలిసి మూవీ చేస్తే అది క్రేజీ మల్టీస్టారర్ అవుతుంది. అసలు ఆ సినిమా ఎలా ఉంటుందనే ఊహనే ఎగ్జైట్ చేస్తుంది. అయితే, ఈ ఇద్దరు స్టార్ హీరోల మల్టీస్టారర్ సినిమా ఉందంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెప్పడం ఇంట్రెస్టింగ్‍గా మారింది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో థమన్ తాజాగా ఈ కామెంట్స్ చేశారు.తెలుగు ఇండియన్ ఐడల్ సెమీఫైనల్స్‌లో యాంకర్ శ్రీరామచంద్ర.. జడ్జిగా ఉన్న థమన్‍ను ఓ ప్రశ్న అడిగారు. బాలకృష్ణ, మహేశ్ బాబు సినిమాల్లో ఒకరి సినిమాకు మ్యూజిక్ చేయాల్సి వస్తే.. ఎవరి చిత్రానికి పని చేస్తారనే రామచంద్ర అడిగారు. దీనికి థమన్ స్పందించారు. వాళ్లిద్దరూ మల్టీస్టారర్ చేస్తారని ఆయన చెప్పారు.తాను బాలకృష్ణ, మహేష్ బాబుల కాంబినేషన్ కథ కోసం విన్నాను అని ఆ సినిమాకి కూడా తానే వర్క్ చేస్తున్నట్టుగా థమన్ తెలిపాడు. సో ఈ సెన్సేషనల్ మల్టీస్టారర్ టాలీవుడ్ నుంచి రానున్న రోజుల్లో రాబోతుంది అని చెప్పాలి. మరి ఇది ఏ దర్శకుడు ప్లాన్ చేసాడు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరి ఈ క్రేజీ భారీ మల్టీస్టారర్ ని ప్లాన్ చేసిన ఆ దర్శకుడు ఎవరో ఎలాంటి సబ్జెక్టుతో ప్లాన్ చేసాడో చూడాలిమరి.అయితే, మల్టీస్టారర్ సినిమా అంటూ థమన్ సీరియస్‍గా చెప్పారా.. సరదాగా అన్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో గ్లోబల్ రేంజ్‍లో సినిమా చేయనున్నారు. దీంతో కనీసం ఇంకో మూడేళ్ల మహేశ్ మరే మూవీ చేసే అవకాశం లేదు. మరి బాలయ్యతో కలిసి ఇప్పట్లో మూవీ చేసే ఛాన్స్ లేనట్టే. ఒకవేళ నిజంగానే ఆ కథ ఉండి.. ఆ ఇద్దరూ ఓకే చెప్పినా ఈ మూవీ పట్టాలెక్కేందుకు నాలుగు సంవత్సరాలైనా పడుతుంది. నిజంగానే ఈ మల్టీస్టారర్ ఆలోచనలు ఉన్నాయా.. థమన్ సరదాగా అన్నారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: