టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రి రిలీజ్ ట్రెండ్ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల చాలామంది స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ చేశారు. అందులో భాగంగానే ఇటీవల మురారి గబ్బర్ సింగ్ వంటి సినిమాలను రిలీజ్ చేయగా అవి దుమ్ముదులుతాయి. భారీ వసూళ్లను సైతం అందుకున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఇప్పుడు మరో సినిమా రిలీస్ కి రెడీ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కేటి కుంజుమన్ నిర్మాతగా ఎస్. శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా తెరకెక్కిన సినిమా ప్రేమికుడు . ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో అందాల నటి నగ్మ హీరోయిన్ గా నటించింది.

 ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించారు. అప్పట్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు రీ-రిలీజ్ కాబోతోంది.  ఇక 30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు మళ్లీ సెప్టెంబర్ 13న థియేటర్లలో ఘనంగా రి రిలీజ్ అవుతోంది. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను వీపరీతంగా ఆకట్టుకుంది ఈ . ఇప్పటికి కూడా ఆ లోని పాటలు అందరి నోళ్లలో నానుతూనే ఉంటాయి. ఈ లో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం నటించడం కే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి

 తగిలితే పాటలో ప్రభుదేవాతో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అంతే. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ రి రిలీజ్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ లో కీ రోల్స్ పోషించిన సంగతి తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: