బిగ్ బాస్ సీజన్ 8.. ఇక్కడ అన్నీ లిమిట్ లెస్” అని నాగార్జున చెప్పినట్లుగానే రోజుకో ట్విస్ట్, టర్న్స్ తో బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక అందరు ఎదురు చూసే ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా వచ్చేసింది. మొదటి వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్ళేది ఎవరా.? అని తెలుసుకోవడానికి ప్రేక్షకుల చాలా ఆసక్తిగా ఉన్నారు.  అయితే ఫస్ట్ వీక్ మొత్తం ఆరుగురు సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు. విష్ణు ప్రియా, బేబక్క, మణికంఠ, సోనియా ఆకుల, పృథ్వీ రాజ్, శేఖర్ భాషా ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. ఈ ఆరుగురు కంటెస్టెంట్స్ లో బెజవాడ బేబక్క, శేఖర్ భాష పేర్లు

 ఎలిమినేషన్ లిస్ట్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆన్ లైన్ పోల్స్ ప్రకారం బేబక్క, శేఖర్ భాష ఇద్దరిలో ఒకరు ఈ వారం బయటకు వెళ్లే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా హౌస్లోకి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. మరో 5-6 కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నారట. ఐదు వారాల అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయట. కాగా టేస్టీ తేజా హౌస్లోకి వస్తున్నాడు అనేది తాజా న్యూస్. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న టేస్టీ తేజా మంచి ఎంటర్టైనర్ గా పేరుగాంచాడు. టేస్టీ తేజా మొత్తంగా 9 వారాలు హౌస్లో ఉన్నాడు. జోక్స్ వేస్తూ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. హౌస్లో శోభా శెట్టి-టేస్టీ తేజా బెస్ట్

 ఫ్రెండ్స్ గా ఉన్నారు. శోభా శెట్టి తన సాధక బాధలు టేస్టీ తేజాతో చెప్పుకునేది. సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు తగ్గిన నేపథ్యంలో టేస్టీ తేజాను రంగంలోకి దించుతున్నారట. అలాగే శోభా శెట్టి సైతం హౌస్లోకి వచ్చే అవకాశం కలదట. ఆమెను కూడా సంప్రదించారట. శోభా శెట్టి మరోసారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేందుకు పచ్చ జెండా ఊపిందట. శోభా శెట్టి దాదాపు 14 వారాలు హౌస్లో ఉంది. ఆమె మీద విపరీతమైన నెగిటివిటీ నడిచింది. అయినా స్ట్రాంగ్ ప్లేయర్ గా ఆమె ఫినాలే ముందు వరకు హౌస్లో ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: