బాస్ సీజన్ 8లో మొత్తంగా 14 మంది హౌజ్లోకి అడుగుపెట్టారు. ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు జంటలుగా కలిసి వెళ్లారు. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్లో ముగ్గురు చీఫ్లు నిఖిల్, నైనిక, యష్మీ మినహా మిగిలిన 11 మంది నామినేషన్ ప్రక్రియలో పాల్గొనగా.. ఆరుగురు నామినేట్ అయ్యారు. వారు.. విష్ణుప్రియ, సోనియా, పృథ్వీరాజ్, శేఖర్ బాషా, బేబక్క, నాగమణికంఠ. అయితే సీజన్ 8లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదనే ప్రచారం కూాడా సాగుతోంది. ఎందుకంటే ఓటింగ్ లైన్స్ కేవలం మూడు రోజులు మాత్రమే ఓపెన్లో ఉండటం వల్ల కంటెస్టెంట్స్ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ఒక్క పాయింట్ తేడాతో కూడా ఎలిమినేషన్

 అయ్యే అవకాశం ఉండనుంది. కాబట్టి.. "నో ఎలిమినేషన్ డే"గా ప్రకటించే అవకాశం కూడా ఉందని ప్రచారం సాగుతోంది.  ఇదిలవుండగా నిన్న సోనియా కి విష్ణు ప్రియా కి మధ్య చిన్న ఫైట్ జరిగింది. ఈ ఫైట్ లో విష్ణు ప్రియా తప్పు లేదు. కానీ గొడవ పెద్దది చేసుకుంది మాత్రం విష్ణు ప్రియనే. జరిగిన గొడవని అక్కడితో వదిలేయకుండా, ఎందుకు ఇలా మాట్లాడావు, ఒక అమ్మాయి మీద అలాంటి ఆరోపణలు ఎలా చేస్తావు అంటూ సోనియా పై తీవ్రంగా మండిపడింది విష్ణు ప్రియా. చివరికి సోనియా అభయ్ వద్ద కూర్చొని ఏడుస్తున్నప్పటికీ కూడా ఆమె సోనియా ని వదలలేదు. ఈమెకే కాదు, ఆమె అన్న మాటలకు నేను కూడా ఏడవాలి. ఒక

 అమ్మాయి అయ్యుండి, ఇంకో అమ్మాయి మీద అలాంటి అబద్దాలు చెప్పొచ్చా, ఎదో ఈమె ఆకాశం నుండి ఊడిపడినట్టు, పుణ్య స్త్రీ లాగా బిల్డప్స్ ఇస్తుంది అంటూ సోనియా ని మరింత కృంగిపోయి ఏడ్చేలా చేసింది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఎక్కువ శాతం మంది విష్ణు ప్రియా కి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆమెకి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి. ఇకఈమెకి బిగ్ బాస్ టీం వారానికి 4 లక్షల రూపాయిలు ఇస్తున్నారు, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే ఈమెకే ఎక్కువ రెమ్యూనరేషన్, అంత డబ్బులు తీసుకుంటున్నప్పుడు, దానికి తగ్గ న్యాయం ఎంతో కొంత చేయాలి కదా?, ఇలాగే ఆమె కొనసాగితే ఆమెకి ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల టాప్ 5 లోకి రావొచ్చు కానీ, టైటిల్ మాత్రం కొట్టలేదని అంటున్నారు విశ్లేషకులు. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: