బాలీవుడ్ లో స్టార్ కపుల్స్ గా పేరు పొందిన దీపికా పదుకొనే, రణబీర్ సింగ్ 2018లో ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. వివాహమానంతరం దీపిక ఎన్నో చిత్రాలలో నటించింది.అలాగే రణవీర్ సింగ్ కూడా ఎన్నో చిత్రాల నటిస్తూ ఫుల్ బిజీగా ఉండేవారు.అయితే వివాహమైన నాలుగేళ్లకి ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా పదుకొనే గర్భవతి అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా కలికి సినిమా ప్రమోషన్స్లో బేబీ బంప్ ఫోటోలు వైరల్ గా మారాయి.


దీపిక ఇటీవలే మూడు రోజుల క్రితం ముంబైలో సిద్ధి వినాయక ఆలయానికి కూడా తన భర్తతో కలిసి రావడంతో ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. దీపిక శనివారం సాయంత్రం ముంబైలో హెచ్ ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిన్నటి రోజున ఆదివారం దీపిక పదుకొనే పండంటి పాపకు జన్మనిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బేబీ గర్ల్ అనే విషయాన్ని రణవీర్ సింగ్  తెలియజేశారు. తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ విషయం విన్న అభిమానులు సైతం మీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు సినీ సెలబ్రిటీలు అభిమానులు. వీరిద్దరూ కలిసి మొదటిసారిగా రామ్ లీలా అనే చిత్రంలో నటించడం జరిగింది. అందులో కూడా అమర ప్రేమికురాలుగా నటించిన ఈ జంట రియల్ లైఫ్ లో కూడా ప్రేమికులుగా మారి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన వీరు నిన్నటి రోజున ఒక చిన్నారికి జన్మనిచ్చి తల్లితండ్రులుగా మారారు. గతంలో దీపిక పదుకొనే ప్రెగ్నెన్సీ పైన ఎన్నో రూమర్స్ సైతం వినిపించాయి. గతంలో కుమారుడికి జన్మనిచ్చిందనే విధంగా కూడా వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ కూడా రూమర్స్ అన్నట్టుగా ఇప్పుడు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: