తెలంగాణ రాష్ట్రంలో రోజుకో దారుణం తెరపైకి వస్తోంది. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని లెక్కలు కూడా చెబుతున్నాయి. శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తినట్లు గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా మహిళలపై తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే... తాజాగా.. ఒక యువతిని బంధించిన సంఘటన తెరపైకి వచ్చింది.

 
ఓయూ రూంలో 20 రోజులపాటు.. ఓ యువతిని  బంధించి మరి లైంగిక దాడి చేశాడట పొద్దుమార్గుడు. ఈ సంఘటన నారాయణ గూడా లోని ఓయో రూమ్ లో జరిగింది. జైనూరు సంఘటన మరువకముందే... ఈ oyo రూమ్ సంఘటన తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బైంసా ప్రాంతానికి చెందిన ఓ బాలిక  కు సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఇన్స్టాగ్రామ్ అనే సోషల్ మీడియాను వాడి... బైంసా ప్రాంతానికి చెందిన ఓ బాలికకు దగ్గరయ్యాడు ఓ అజ్ఞాత వ్యక్తి.



సోషల్ మీడియా లోనే చాటింగ్  చేసుకొని... ఈ జంట దగ్గరికి అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ వ్యక్తి.. ఏది చెబితే అది వినేటట్లు...  ఆ యువతిని... మార్చేసాడట. ఈ నేపథ్యంలోనే భయం సంగతి చెందిన బాలికను ఓయో రూంకు రప్పించాడట ఆ దుర్మార్గుడు. నారాయణగూడ లోని... ఓయూ రూముకు వచ్చిన ఆ బాలికను... ఏకంగా 20 రోజుల పాటు బంధించాడట నిందితుడు.

20 రోజులపాటు ఆ బాలికపై లైంగిక దాడి కూడా జరిగినట్లు సమాచారం. అయితే దీనిపై పోలీసులు విచారణ చేయడం జరుగుతోంది. అయితే అక్కడ ఉన్న లొకేషన్ ను... చాలా చాకచక్యంగా తన తల్లిదండ్రులకు పంపించిందట బాలిక. ఇక ఆ వివరాలను వెంటనే... స్థానిక పోలీసులకు అందించారట ఆ తల్లిదండ్రులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఓయూ రూముకు వెళ్లి బాలికను రక్షించారట. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుడు పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: