తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి వరుసలో ఉంటారు. వీరిద్దరూ కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోలుగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న విషయం మనకు తెలిసిందే. పవన్ ఇప్పటికే మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొంత భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసిన వరుస రాజకీయాల పనులతో మళ్ళీ ఆ సినిమాలను తిరిగి మొదలు పెట్టలేకపోతున్నాడు.

ఇక మహేష్ బాబు , రాజమౌళి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రాజమౌళి సినిమా అంటేనే చాలా సంవత్సరాలు చిత్రీకరణ జరుగుతుంది అనే విషయం తెలిసింది. ఇక ఇప్పటికే రాజమౌళి , మహేష్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులకే చాలా సమయాన్ని కేటాయించాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికీ స్టార్ట్ కాలేదు. దానితో ఓ వైపు పవన్ కళ్యాణ్ రాజకీయ పనులతో బిజీగా ఉండి కొత్త సినిమాలతో తన ప్యాన్స్ ను ఆకట్టుకోలేకపోతుండగా , పవన్ కళ్యాణ్ , రాజమౌళి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన కూడా ఇప్పట్లో తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు లేవు. దానితో ఈ ఇద్దరు హీరోలు సరికొత్త ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.

అదేంటంటారా అదే రీ రిలీజ్. వీరిద్దరి సినిమాలను వరుస పెట్టి రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మధ్య కాలంలోనే పవన్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. మహేష్ నటించిన మురారి సినిమా కూడా రీ రిలీస్ అయ్యి సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక మరికొన్ని రోజుల్లోనే వీరిద్దరు నటించిన మరిన్ని సినిమాలను కూడా రీ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: