స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన అపరిచితుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో విక్రమ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .ఈ సినిమాలో విక్రమ్ సరసన సదా హీరోయిన్ గా నటించింది .దర్శకుడు శంకర్ తనదైన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు..ఈ సినిమా అప్పట్లోనే భారీగా కలెక్షన్స్ సాధించింది.మనుషులు చేసే తప్పులు, వాటికి నరకంలో విధించే శిక్షలను ‘అపరిచితుడు‘ భూమి మీదే విధించడం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. వకీలుగా పని చేసే రామానుజం మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ బాధపడుతూ, సందర్భాన్ని బట్టి రెమో, అపరిచితుడుగా మారిపోతాడు. మూడు పాత్రల్లో విక్రమ్ నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. తమిళంలో ‘అన్నియన్‘ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘అపరిచితుడు‘గా విడుదల చేశారు.సౌత్ లో సంచలన విజయం సాధించిన ‘అన్నియన్’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 2021లోనే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్లు నిర్మాత జయంతిలాల్ గడా వెల్లడించారు. గతంలోనే శంకర్ తో ఈ సినిమాకు సంబంధించి చర్చలు కూడా జరిపారు. అయితే, ‘అన్నియన్‘ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ హిందీ రీమేక్ కు సంబంధించి ఆర్థిక అంశాలపై కోర్టుకెక్కాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు.తాజాగా ‘తంగలాన్‘ సినిమా ప్రమోషనల్ లో పాల్గొన్న నటుడు విక్రమ్ ‘అన్నియన్‘ హిందీ రీమేక్ తో పాటు సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అన్నియన్‘ రీమేక్ గురించి దర్శకుడు శంకర్ ని అడగడం మంచిదన్నారు. “అన్నియన్‘ రీమేక్ గురించి శంకర్ కే తెలుసు. అతడిని నేనూ ఓ విషయం అడగాలి. నాతో పార్ట్ 2 తీయాల్సి ఉంది” అని నవ్వుతూ చెప్పారు. ఇక హిందీ రీమేక్ గురించి మాట్లాడుతూ... "ఇది చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం. రణవీర్ సింగ్ ‘అన్నియన్’ను అద్భుతంగా చేస్తాడని భావిస్తున్నాను. నేను అతడి వెర్షన్ ను వీలైనంత త్వరగా చూడాలి అనుకుంటున్నారు. అతడి నటన అంటే నాకూ చాలా ఇష్టం. ఈ సినిమాను అతడు ఎలా చేస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.
రీమేక్ పై ప్రకటన వచ్చిన ఇంకా షూటింగ్ మొదలు అవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: