మాస్ మహారాజా రవితేజ తాజాగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... టాలెంట్ డైరెక్టర్ హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... జగపతి బాబు ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. ఆగస్టు 15 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది.

దానితో ఈ మూవీ కి మొదటి రోజు నుండే కలెక్షన్లు తగ్గాయి. ఇక చివరగా ఈ సినిమాకి చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ ద్వారా నిర్మాతకు పెద్ద మొత్తంలో నష్టాలు కూడా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ ద్వారా నిర్మాతకు పెద్ద మొత్తంలో నష్టాలు రావడంతో ఈ మూవీ లో హీరో గా నటించిన రవితేజ తాను తీసుకున్న రెమ్యూనరేషన్ లో నుండి 4 కోట్లు తిరిగి నిర్మాతకు ఇచ్చినట్లు , ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా తాను తీసుకున్న పారితోషకం నుండి 2 కోట్ల రూపాయలను తిరిగి నిర్మాతకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇలా ఈ సినిమా హీరో , దర్శకుడు ఇద్దరు కూడా తాము తీసుకున్న పారితోషకాల నుండి కొంత మొత్తాన్ని నిర్మాతకు మళ్ళీ తిరిగి ఇవ్వడంతో ఆయన భారీ నష్టాల నుండి కాస్త బయట పడ్డట్లు తెలుస్తోంది. అలా నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ కాస్త నష్టాల నుండి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తే రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: