టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మహేష్ బాబు సినీ నటి అయినటువంటి నమ్రత ను ప్రేమించి పెళ్లాడిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత నమ్రత ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా కనిపించలేదు. ఇక మహేష్ , నమ్రత దాంపత్య జీవితం ఎంతో సుఖసంతోషాలతో ముందుకు సాగుతుంది. వీరి జంటకు ఇద్దరు సంతానం. ఇకపోతే మహేష్ , నమ్రత మాటకు ఎంతో గౌరవం ఇస్తుంటాడు అని అనేక సార్లు వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా అందుకు ఉదాహరణగా మరో వార్త కూడా వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మొదటగా పూరి జగన్నాథ్ , మహేష్ సరసన త్రిష ను హీరోయిన్గా తీసుకుందాం అనుకున్నాడట. ఆ విషయాన్ని మహేష్ బాబు కు చెప్పాడట. ఆయన కూడా ఓకే అన్నాడట. ఇక అదే విషయాన్ని మహేష్ , నమ్రతకు చెప్పగా , నమ్రత కొన్ని రోజుల క్రితమే అతడు సినిమా వచ్చింది. అందులో నువ్వు , త్రిష హీరో , హీరోయిన్లుగా నటించారు. మళ్లీ మీరిద్దరే జంటగా నటిస్తే చూసే ఆడియన్స్ కు పెద్దగా కొత్త దనం కనిపించదు. మళ్లీ ఆ సినిమా రిఫరెన్స్ ఇందులో ఉంది అనే నెగటివ్ టాక్ కూడా జనాల నుండి వచ్చే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితమే దేవదాసు అనే సినిమా వచ్చింది. అందులో ఇలియానా హీరోయిన్గా నటించింది. ఆ అమ్మాయి బాగుంది.

ఆ అమ్మాయిని పోకిరి సినిమాలో హీరోయిన్గా ట్రై చేయండి. బాగుంటుందేమో అని ఒక ఐడియా ఇచ్చిందట. ఇక మహేష్ ఇదే ఐడియాను పూరి జగన్నాథ్ కు చెప్పడం , ఆయనకు కూడా పోకిరి లో త్రిష కంటే ఇలియానా బాగుంటుంది అనే ఆలోచనకు రావడం , అలా పోకిరి సినిమాలో త్రిష కాకుండా ఇలియానా ను హీరోయిన్గా తీసుకోవడం జరిగింది అంట. మహేష్ , నమ్రత మాటకు విలువను ఇవ్వడం వల్ల పోకిరి సినిమాలో త్రిష బదులు ఇలియానా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: