ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురి అయ్యాయి. దానితో ప్రభుత్వాలు దగ్గరుండి మరి వరద ముంపుకు గురైన ప్రాంతాలను సంరక్షించడం , మాత్రమే కాకుండా ఆ వరదల ద్వారా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కూడా సహాయ సహకారాలను అందిస్తున్నాయి. ఇకపోతే ప్రభుత్వాలు మాత్రమే కాదు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది వ్యక్తులు కూడా ముందుకు వచ్చి ఇప్పటికే పెద్ద మొత్తంలో ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటించాయి.

ఎక్కువ శాతం టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన హీరోలు రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరద బాధితులకు విరాళాలను ప్రకటించారు. ఇకపోతే సినిమా హీరోయిన్లు మాత్రం విరాళాలు అంటే ముందుకు రావడం లేదు. కోట్లలో కొంత మంది నటీమణులు రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమ ద్వారానే ఎంతో గొప్ప జీవితాన్ని గడుపుతున్న కొంతమంది హీరోయిన్లు కూడా తెలుగు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రం ముందుకు వచ్చే డబ్బు సహాయం చేయడం లేదు. ఇక చిన్న హీరోయిన్గా కెరీర్ను ముందుకు సాగిస్తూ  తక్కువ మొత్తంలో పారితోషకం తీసుకుంటున్న అనన్య నాగళ్ళ మాత్రం పెద్ద మనసుతో ముందుకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది.

ఈమె ప్రకటించిన విరాళం చిన్న మొత్తమే కావచ్చు. కానీ ఈమె స్టార్ హీరోయిన్ కాదు. ఏవో చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ వస్తోంది. అయినప్పటికీ పెద్ద మనసు చేసుకొని 5 లక్షల విరాళాన్ని ఇచ్చింది. దానితో చాలా మంది స్టార్ హీరోయిన్లు , కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకునే వారి కంటే నువ్వు ఎంతో గొప్ప మనసు ఉన్న దానివి అంటూ ఈమెపై ప్రశంశాలను కురిపిస్తున్నారు. ఇక అనన్య నగళ్ళ చేసిన సహాయాన్ని ఎంతో మంది గొప్పగా పోగుడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: