తెలుగు సినీ పరిశ్రమ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు . ఈ ముద్దు గుమ్మ ఒక లైలా కోసం అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఇందులో ఈమె తన అందాలతో , నటన తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం తో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన సినిమా అవకాశాలు దక్కడం మొదలు అయింది . అలాగే ఈమె నటించిన సినిమాలు కూడా చాలా వరకు మంచి విజయాలు సాధిస్తూ వెళ్లడంతో చాలా తక్కువ కాలం లోనే పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమెకు తమిళ సినిమా పరిశ్రమ నుండి కూడా అవకాశాలు వచ్చాయి. దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్గా మారిపోయింది. ఈ మధ్య కాలంలో మాత్రం పూజా హెగ్డే కు సరైన విజయాలు లేవు. దానితో ఈమె కెరియర్ కూడా ప్రస్తుతం డల్ గానే కొనసాగుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. డిమాంటి కాలనీ సిరీస్ మూవీల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు మరికొన్ని రోజుల్లోనే ఓ వెబ్ సిరీస్ ను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వెబ్ సిరీస్లో పూజా హెగ్డే ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: