ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న కుటుంబాల నుండి నిర్మాణ రంగం లోకి వారసురాలుగా మహిళలు కూడా వస్తున్నారు . అందులో భాగంగా ఇప్పటికే కొంత మంది నిర్మాణ రంగం లో సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. అలా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కుటుంబాల నుండి నిర్మాణ రంగం లోకి వచ్చిన వారు ఎవరో తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కుటుంబాలలో మెగా కుటుంబం ఒకటి. ఇకపోతే మెగా కుటుంబం నుండి నాగబాబు కూతురు నిహారిక చాలా కాలం క్రితమే నిర్మాణ రంగం లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే మంచి విజయాలను కూడా నిహారిక అందుకుంది. నిహారిక తాజాగా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాను కూడా నిర్మించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.  నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తుంది. ఇకపోతే చిరంజీవి కూతురు సుస్మిత కొణిదల కూడా నిర్మాణ రంగం లోకి ఎంట్రీ ఇచ్చింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుస్మిత సినిమాలను నిర్మిస్తోంది. 

ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కుటుంబాలలో ఒకటి అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి తన కుమార్తె అయినటువంటి ఘట్టమనేని మంజుల కూడా నిర్మాణ రంగం లోకి ఎంట్రీ ఇచ్చి మంచి స్థాయి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచు గుర్తింపు కలిగిన కుటుంబాలలో నందమూరి కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుండి బాలకృష్ణ చిన్న కూతురు అయినటువంటి తేజస్వి నిర్మాణ రంగం లోకి అడుగు పెట్టబోతుంది. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ మొట్ట మొదటి చిత్రాన్ని తేజస్వి నిర్మించబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: