నందమూరి బాలయ్య ఒకవైపు వరుస సినిమాలు, టాక్ షోస్ తో హల్ చల్ చేస్తున్నాడు. మరోవైపు బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా ఎదురు చూస్తోంది. అటు వైపు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం స్టార్ హీరోగా ఎదగడం చకచక జరిగాయి. మరొక స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. దీంతో బాలయ్య కొడుకు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని చాలా కాలంగా చర్చ నడిచింది. వాస్తవానికి నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా

 పడుతూ వస్తోంది. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు మోక్షజ్ఞ. మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.  లెజెండ్ మూవీస్ బ్యానర్ పై బాలయ్య చిన్న కూతురు మతుకుమల్లి తేజస్విని, ఎస్ఎల్వీ బ్యానర్ చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న రెండో ప్రాజెక్టు అని దర్శకుడు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తోపాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు  బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ   కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కోవలోనే మెగా ఫ్యామిలీకి చెందిన

 సాయిదుర్గాతేజ్ కూడా మోక్షజ్ఞ శుభాకాంక్షలు తెలియజేశారు.  బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ  సినీ పరిశ్రమలోకి ప్రవేశించినందుకు తాను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఈరోజు నుంచి మీరు సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మంచి అపురూపమైన తెలుగు సినిమాతో, తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆదరాభిమానాలతో మీ సినీ రంగ ప్రవేశం శుభప్రదమవుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు సాయిధరమ్ తేజ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: