ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నుంచి వస్తున్న సినిమా అవ్వడంతో 'దేవర' పై అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి. రెండు పార్ట్‌లుగా ఈ సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ 'దేవర 1' ను ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. షూటింగ్‌ తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేసుకున్న దేవర టీం ప్రమోషన్స్‌ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఈనెల 10వ తారీకున సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ట్రైలర్‌ రిలీజ్ అంటూ ప్రకటన చేస్తూ వినాయక చవితి సందర్భంగా దేవర టీం రిలీజ్ చేసిన పోస్టర్‌ కి భారీ స్పందన వచ్చింది. బ్లాక్ డ్రెస్ లో సీరియస్ లుక్ లో ఎన్టీఆర్‌ చూపు తిప్పుకోనివ్వలేదు. సినిమా పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ట్రైలర్‌ లాంచ్‌ కోసం ఎన్టీఆర్‌ ముంబైలో ల్యాండ్‌ అయ్యాడు. దేవర ట్రైలర్ లాంచ్ కోసం ముంబైలో ఎన్టీఆర్‌ ల్యాండ్‌ అయ్యాడు అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ట్రైలర్ లాంచ్ కార్యక్రమం 10వ తారీకున కాగా 8వ తారీకునే ముంబైకి ఎన్టీఆర్‌ చేరుకోవడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. సినిమా ప్రమోషన్ కోసం పలు మీడియా సంస్థలకు, సోషల్‌ మీడియా వారికి ఎన్టీఆర్‌ రేపు అంటే 9వ తారీకున ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నాడట. దేవర గురించి పలు కార్యక్రమాల్లో పాల్గొని పబ్లిసిటీ చేసే విధంగా ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్‌ ముంబై చేరుకుని ఉండవచ్చు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో 10వ తారీకు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్టీఆర్ మీడియా సమావేశం నిర్వహించి, అక్కడే ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాడు.

ఇదిలావుండగా అర్జున్ రెడ్డి,యానిమల్ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ చోటుకు చేరారు.దేవర సినిమా ట్రైలర్  లాంచ్ ఈవెంట్ రేపు ముంబైలో జరగనుండగా అక్కడ వీరిద్దరూ కలిసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటు సందీప్ రెడ్డి పాల్గొనా నున్నట్లు తెలుస్తుంది అయితే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు వీటి ఫోటోలను షేర్ చేస్తున్నారు.ముందుగా అనుకున్న ప్రకారం హైదరాబాద్‌ లోనే ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమం ఉండాల్సింది. కానీ ఆ వెంటనే భారీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను దేవర టీం ప్లాన్‌ చేస్తున్నారు. కనుక ముంబైలో దేవర పబ్లిసిటీ చేస్తే కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉందని, ఆర్ఆర్ఆర్ స్టార్‌ కొత్త సినిమా దేవర అంటూ హిందీ మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చే అవకాశం ఉందని అక్కడ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ ను ఏర్పాటు చేసి ఉంటారు. దేవర సినిమాలో హీరోయిన్‌ బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ అవ్వడం వల్ల అక్కడ అంచనాలు భారీగా ఉన్నాయి.10వ తారీకున జరుగబోతున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ లో ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ లతో పాటు సైఫ్ అలీ ఖాన్‌ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. సైఫ్ అలీఖాన్‌ దేవర లో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో వచ్చిన క్రేజ్‌ కారణంగా దేవర 1 ను ఉత్తరాదిన భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు బయ్యర్లు సిద్ధం అవుతున్నారు. మరో వైపు యూఎస్ లో దేవర సినిమాకు విపరీతమైన అడ్వాన్స్ బుకింగ్‌ నమోదు అవుతోంది. చాలా స్పీడ్‌ గా 20 వేల టికెట్లు అమ్ముడు పోయాయని, ఇది రికార్డ్‌ అంటూ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రకటించింది. హైప్ మరింత క్రియేట్‌ చేసే విధంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ 10న వైభవంగా జరుగనుందట. ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: