టాలీవుడ్‌ సినీ నటి రేణు దేశాయ్ ప్రతి ఒక్కరికి పరిచయమే. హీరోయిన్ గా చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. 22 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ వివాహానికి ముందే అఖీరానందన్ అనే మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వివాహ అనంతరం వీరికి ఆద్య అనే కూతురు జన్మించింది. కేవలం మూడేళ్లపాటు కలిసి ఉన్న ఈ జంట విడాకులు తీసుకున్నారు.


వీరు విడిపోయి ఇప్పటికీ 11 సంవత్సరాలు గడుస్తోంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గుర్తులు మాత్రం రేణు దేశాయ్ ను వెంటాడుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో విడాకులు తర్వాత రేణు తన ఇద్దరు పిల్లల బాధ్యతలను తానే తీసుకుంది. గత కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వర్రావు సినిమాలో కీలకపాత్రలో నటించింది. ఆ తర్వాత కొన్ని షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.


రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. తనకు, తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో తన అభిమానులకు చేరవేస్తుంది. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఆరోగ్యం బాగోలేదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమెకు ఏమైంది, తన ఆరోగ్య పరిస్థితి విషమించిందా... అనే అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవలే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన ఆరోగ్యం అస్సలు బాగోలేదని తెలిపింది.


తన నానమ్మ కేవలం 47 ఏళ్లకి గుండె జబ్బుతో మృతి చెందిందని, ఇక ఆమె తండ్రి కూడా చాలా తక్కువ వయసులోనే గుండె జబ్బుతో మరణించాడని తెలిపింది. ఇప్పుడు రేణు దేశాయ్ కూడా అదే సమస్యను ఎదుర్కొంటుందట. తనకి కూడా గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు ఉన్నాయట. అందుకే ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ, మందులు వాడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో తన ఆరోగ్యం సహకరించడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో రేణు దేశాయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: