గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ సాంగ్‌, వస్తోన్న అప్డేట్లతో గేమ్ ఛేంజ‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ

 మూవీ నుంచి మ‌రో క్రేజీ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సెప్టెంబ‌ర్ నెల‌లో సినిమా నుంచి మ‌రో సాంగ్‌కి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు.  ఈ సినిమాకు సంబంధించిన రామ్‌చరణ్‌ వర్క్‌ డబ్బింగ్‌ మినహా పూర్తయింది. త్వరలోనే తన పాత్రకు రామ్‌చరణ్‌ డబ్బింగ్‌ చెప్పనున్నారు. ఇందులో ఆయన తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఓ పాత్ర పేరు అప్పన్న కాగా, మరో పాత్ర పేరు రామ్‌నందన్‌ ఐఏఎస్‌ అని తెలుస్తున్నది. రెండు పాత్రలూ పవర్‌ఫుల్‌గా ఉంటాయని సమాచారం .కొన్నిరోజుల క్రితం ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాలోని తొలిపాటను

 విడుదల చేశారు. 'జరగండి జరగండి జరగండీ..' అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సెప్టెంబర్లో సెకండ్‌ సింగిల్‌ విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ఓ పోస్టర్‌ ద్వారా ప్రకటించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న  ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు తమన్‌ ఇస్తున్న అప్‌డేట్లు కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. అంజలి, కైరా అద్వానీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌, సముద్రఖని తదితరులు ఇతర పాత్రధారులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: