ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయిపోయింది.  బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ మా ఛానల్‌లో సెప్టెంబర్ 01 ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభం అయ్యింది. మూడో సీజన్ నుంచి వరుసగా హోస్ట్ చేస్తూ వస్తున్న నాగార్జునే.. ఈ 8వ సీజన్‌కి కూడా హోస్టింగ్ చేస్తున్నారు. అయితే గత సీజన్ల కంటే భిన్నంగా బిగ్ బాస్ ఆట కొనసాగబోతుంది. ప్రతి సీజన్‌లోనూ ఒక్కో కంటెస్టెంట్‌ని హౌస్‌లోకి పంపేవారు. అయితే ఈ సీజన్‌లో ఆటని జంటగా మొదలుపెట్టిస్తున్నారు. ఒక్కో కంటెస్టెంట్‌ని కాకుండా.. ఇద్దరిద్దరుగా హౌస్‌లోకి పంపుతున్నారు. మొత్తం ఏడు జంటల్ని అంటే మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌ని

 హౌస్‌లోకి పంపిస్తున్నారు . ఇదిలా ఉంటే గత వారం నామినేషన్స్‌లో విష్ణు ప్రియా, సోనియా, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్వీ, బెజవాడ బేబక్క ఉండగా ఒకొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. శనివారం రోజు సోనియాని సేవ్ చేశారు.. ఇక ఆదివారం ఎపిసోడ్ లో శేఖర్ బాషా‌ని.. తరువాత పృథ్వీ, విష్ణు ప్రియలను సేవ్ చేశారు. చివరికిగా నాగ మణికంఠ, బేబక్కలు మిగిలారు. ఈ ఇద్దరిలో నాగ మణికంఠను సేవ్ చేసి బేబక్కను ఎలిమినేట్ చేశారు. అయితే చాలా మంది నాగమణికంఠ వెళ్ళిపోతాడని అనుకున్నారు. కానీ చివరిలో ఊహించని విధంగా బేబక్కను ఎలిమినేట్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. అభయ్ నవీన్, శేఖర్ బాషా,

 సోనియా మిగిలినవారు మణికంఠ ఎలిమినేట్ అవుతాడని గట్టిగా ఫిక్స్ అయ్యారు.. కానీ సీన్ రివార్స్ అయ్యింది. చివరి వరకు మణికంఠ చాలా టెన్షన్ పడ్డాడు. అయితే వారం రోజులపాటు బిగ్ బాస్‌లో ఉన్న బేబక్కకు రెమ్యునరేషన్‌గా రూ. 1.30 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే, బిగ్‌బాస్‌ వల్ల బేబక్కకు సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోవర్స్‌ పెరిగారు. ఆమె ఎలిమినేషన్‌ అయినా సరే ఎలాంటి నెగెటివిటీ లేకుండానే బయటకొచ్చారు. ఎప్పుడూ కిచెన్‌లో ఉన్న బేబక్క తన వంటతో హౌస్‌మేట్స్‌ కడుపునింపినా ప్రేక్షకులకు ఏమాత్రం వినోదం ఇవ్వడం లేదు. ఈ కారణంతోనే ఆమె ఎలిమినేషన్‌ అయ్యారని చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: