యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నాడు. ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ తర్వాత రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు ప్రభాస్. అలాగే కొన్ని రోజుల క్రితమే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్న ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంఛ్ అయ్యింది. ఇవి రెండు కాకుండా డార్లింగ్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.  త్వరలోనే సలార్ 2, స్పిరిట్, కల్కి 2 చిత్రాలు కూడా

 ప్రారంభం కానున్నాయి. ఇవే కాకుండా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రంలోనూ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న ప్రభాస్.. బయట కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హర్రర్ కామెడీ జోనర్ లో ది రాజాసాబ్ మూవీ సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు

 మారుతి అస్సలు బ్రేక్ తీసుకోకుండా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారంట. ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ నడుమ వచ్చే సన్నివేశాలని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వేగంగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని మారుతి ప్లాన్ చేసుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే షూటింగ్ షెడ్యూల్ పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. వినాయకచవితి, ఆదివారం కూడా రెస్ట్ తీసుకోకుండా షూట్ చేసారంట. ప్రస్తుతం కీలకమైన ఫన్నీ సీక్వెన్స్ ని మారుతి తెరకెక్కిస్తున్నారంట ఈ సీక్వెన్స్ లలో హీరో, హీరోయిన్స్ తో పాటు మరికొంత మంది నటీనటులు కూడా పాల్గొంటున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: