చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది నట వారసులు ఎంట్రీ ఇచ్చారు.. ఇస్తున్నారు కూడా. అయితే హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే విలన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులగా పరిశ్రమలోకి వస్తుంటారు. కానీ.. ఓ స్టార్ హీరో కొడుకు మాత్రం వీరందరి కంటే భిన్నంగా డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. అతడే దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్. అతడిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ చిత్రం చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఇక ఇందులో హీరో ఎవరు? అన్నది అప్పుడు వెల్లడించలేదు. కానీ.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇందులో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నాడు. కోలీవుడ్ లో భారీ చిత్రాలు నిర్మిస్తుందన్న పేరున్న లైకా ప్రొడక్షన్ హౌస్ ద్వారా అతడు డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ మూవీలో హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ మూవీకి సంబంధించి మరో విశేషం ఏంటంటే? ఏఆర్ రెహమాన్ కొడుకు సంగీతం అందించబోతున్నట్లుగా సమాచారం. అతడు కూడా ఈ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ ప్రముఖ హీరోయిన్ సందీప్ కు జోడీగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో.. ఇదెక్కడి క్రేజీ కాంబో మావ అంటూ మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే.. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.కాగా.. సందీప్ కిషన్ ఇటీవలే వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రాయన్’ లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించడానికి వెనకాడటం లేదు సందీప్ కిషన్. ఇదిలా ఉండగా.. జాసన్ సంజయ్ తండ్రి దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. వసూళ్ల పరంగా కూడా విజయ్ అదరగొడుతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ను అలరిస్తోంది. విడుదలైన మూడో రోజే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: