సలార్ 2 చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలుసు. ప్రభాస్ నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో, దాని సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో సలార్ 2 చిత్రంలో మరో సూపర్ స్టార్ నటించనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక విషయానికి వస్తె సలార్ 2 సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా ఇందులో మోహన్ లాల్ నటించినట్లయితే

 ఇది తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. మోహన్‌లాల్, ప్రభాస్ కలిసి స్క్రీన్ షేర్ చేస్కుబోతున్నారు అని తెలుసుకున్న అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది స్పష్టంగా తెలియదు. కొన్ని సమాచారం ప్రకారం మోహన్‌లాల్‌ను సలార్ 2లో నటించమని ఆహ్వానించారని ఆయన కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది కాసేపు పక్కన పెడితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  తెరకెక్కబోతున్న ఈ సినిమాలో శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా,

 పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి తిరిగి సెట్స్ పైకి రానున్నారు. ఈ పార్ట్ 2 సినిమాకు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారు. ఇకపోతే ఆ మధ్య ‘సలార్ 2’ సినిమా నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ఇలా చెప్పుకొచ్చారు.. ‘ఈ సినిమా పార్ట్-2 ని త్వరగా పూర్తి చేసి.. 2025లో రిలీజ్‌ చేస్తాం అంటూ వెల్లడించారు. కాగా పార్ట్-2 సినిమా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుందని ఆయన తెలిపారు. ఏదేమైనాప్పటికీ కూడా ప్రభాస్ సలార్ 2 సినిమా తో  రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: