బాలయ్య బాబు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తెలుగువారికి ఎంతో దగ్గర అయింది. ఈ అందాల తార మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత నటిగా చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ మన తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషా చిత్రాలలో యాక్ట్ చేస్తూ మెప్పిస్తుంది. ఈ అందాల తారకు చిన్నప్పటి నుంచి నటన, నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది అందుకే సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చింది. కంచె, ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక, అఖండ వంటి సినిమాల్లో నటించి ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో తన అద్భుతమైన పర్ఫామెన్స్ లకు గాను అవార్డులు కూడా చేజిక్కించుకుంది. తాజాగా ఆమె షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ఆమె ఓ హాట్ డ్రెస్ లో అద్భుతంగా కనిపించింది.

ఎద అందాలు షో చేస్తూ పిచ్చెక్కించింది. ఈ తార ఇలా అందాలు ఆరబోయడం కొత్తేం కాదు. అందుకే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో బీభత్సమైన సంఖ్యలో ఫ్యాన్ ఫాలోవర్లు ఉన్నారు. 1988, జనవరి 12న మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ లో ప్రగ్యా జైస్వాల్ పుట్టింది. ఈమెకు ఒక సిస్టర్ ఉంది. ఆమె పేరు ప్రంజూల్ జైస్వాల్. ఆమె మాత్రం సినిమాల్లోకి రాలేదు. ప్రగ్యా జైస్వాల్ నటనపై మక్కువ ఉన్న సరే చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆమె పుణేలోని సింబయాసిస్ లా స్కూల్‌లో చదివింది.

అప్పుడే వివిధ అందాల పోటీల్లో పాల్గొని మోడల్‌గా మారింది. 2014లో కళ, సాంస్కృతిక రంగంలో ఆమె చాలా విజయాలు సాధించింది. అందుకే ఈ ముద్దుగుమ్మకు సహజీవన సాంస్కృతిక పురస్కారాన్ని అందజేశారు. 2008 ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీల్లో కూడా ఈ తార పాటిస్పేట్ చేసింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డ్యాన్సింగ్ క్వీన్, మిస్ ఫ్రెండ్ ఎర్త్ టైటిల్స్‌ను కూడా సొంతం చేసుకుంది.

2015లో మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు మూవీ లో అడుగు పెట్టింది. అదే ఏడాది వచ్చిన కంచె సినిమాలో వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా, సన్ అఫ్ ఇండియా సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటించి మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: