* ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆయన రియల్ హీరో  

* లక్షల మంది బాధితులను ఆదుకుంటారు

* అతనే కింగ్ ఖాన్ షారుక్ ఖాన్  

( భారతదేశం - ఇండియా హెరాల్డ్)

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ మంచి నటుడు మాత్రమే కాదు, గొప్ప మనసున్న వ్యక్తి కూడా. ముఖ్యంగా విపత్తు సమయాలలో ఆయన చేసే దానధర్మాలు ఎంతో ప్రశంసనీయం. గత కొన్ని ఏళ్లుగా, ప్రకృతి వైపరీత్యాల వల్ల బాధపడుతున్న వారికి ఆయన భారీగా సహాయం చేశారు. ఆయన 2014లో కశ్మీర్‌లో భారీ వరదలు వచ్చిన సమయంలో చాలా కోట్లు డొనేట్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. షారుఖ్ ఖాన్ ప్రధాన మంత్రి సహాయ నిధికి కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

అయితే, ఈ విరాళం గురించి అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ, వేలాది మంది తమ జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవడానికి కష్టపడుతున్న సమయంలో ఆయన ఈ సహాయం చేయడం చాలా మెచ్చుకోదగ్గ విషయం.2015లో నేపాల్‌లో భారీ భూకంపం వచ్చినప్పుడు కూడా, షారుఖ్ ఖాన్ ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే కంపెనీ ద్వారా ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సహాయం వల్ల భూకంపం వల్ల ఇబ్బంది పడ్డ చాలా మందికి మంచి జరిగింది.

2018లో కేరళలో వచ్చిన వరదల సమయంలో, షారుఖ్ ఖాన్ స్థాపించిన మీర్ ఫౌండేషన్ ద్వారా 21 లక్షల రూపాయలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. 2013లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల సమయంలో కూడా, షారుఖ్ ఖాన్ ఉత్తరాఖండ్ సహాయ నిధికి చాలా డబ్బు విరాళంగా ఇచ్చారు. 2001లో గుజరాత్‌లో భూకంపం వచ్చినప్పుడు, షారుఖ్ ఖాన్ మొదటగా సహాయం చేసిన సెలబ్రిటీలలో ఒకరు. ఆయన ఆ భూకంపం వల్ల ఇబ్బంది పడ్డ వారికి చాలా సహాయం చేశారు.

షారుఖ్ ఖాన్ పుల్వామా అటాక్‌లో చనిపోయిన మన దేశ అమరవీరుల కుటుంబాలకు కూడా సహాయం చేశారు. ఆయన వారి కోసం 15 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. 2020లో కరోనా వైరస్ వ్యాధి చాలా దేశాలను బాగా ప్రభావితం చేసింది. ఆ సమయంలో, షారుఖ్ ఖాన్ భారతదేశంలోని చాలా మందికి సహాయం చేశారు. ఆయనకు చెందిన కంపెనీలు హాస్పిటల్‌లకు, మందులకు, ఆహారానికి డబ్బు ఇచ్చాయి. ఆయన ఎంత డబ్బు ఇచ్చారో స్పష్టంగా చెప్పలేదు కానీ, బాలీవుడ్‌లోని ఇతర హీరోల కంటే ఆయన ఎక్కువ సహాయం చేశారు. షారుఖ్ ఖాన్ కష్టపడుతున్న వారికి ఎప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన నిజమైన హీరో.

మరింత సమాచారం తెలుసుకోండి: