మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్గా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ విజయం అందుకున్న వేదాలం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. పోయిన సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన భోళా శంకర్ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేక పోయింది.

చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదల సంవత్సరం తర్వాత బుల్లి తెర పై ప్రసారం కాబోతోంది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు చానల్లో ప్రసారం చేయనున్నట్లు జీ తెలుగు సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇక విడుదల అయిన సంవత్సరం తర్వాత ఈ మూవీ బుల్లి తెర పైకి రాబోతుంది. దానితో బుల్లి తెరపై ఈ సినిమాలు చూడాలి అని అనుకునే ప్రేక్షకులకు ఇది మంచి న్యూస్ గా మారింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిష ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: