సూపర్ స్టార్ మహేష్ బాబు వల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ప్రాణ మిత్రుడికి దూరమయ్యారా..ఇంతకీ తెరవెనక జరిగిందేంటి..మహేష్ బాబు ఎందుకు పవన్ కళ్యాణ్ ని తన స్నేహితుడితో విడగొట్టారు అనేది ఇప్పుడు చూద్దాం..  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తన స్నేహితుడితో మహేష్ బాబు విడగొట్టారు అంటూ వస్తున్న వార్తల్లో ఉన్న నిజం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ నటుడు డైరెక్టర్ అయినటువంటి ఎస్ జె సూర్యతో మంచి స్నేహాన్ని మెయింటైన్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇక పవన్ కళ్యాణ్ తో ఖుషి వంటి బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించిన ఎస్.జే.సూర్య ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి ఖుషి కి సీక్వెల్ గా ఖుషి -3మూవీ ని కూడా తీద్దాం అనుకున్నారట.ఇక ఈ మూవీ కోసం కొన్ని చర్చలు కూడా జరిపారట. 

అదే సమయంలో కాటమరాయుడు సినిమాకి దర్శకుడిగా ఎస్. జే.సూర్యని పవన్ కళ్యాణ్ తీసుకున్నారట. అయితే ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఆఫర్ వదులుకొని మహేష్ బాబు హీరోగా చేసిన స్పైడర్ మూవీ లో విలన్ పాత్ర పోషించారు ఎస్ జె సూర్య. దాంతో చిర్రెత్తుకొచ్చిన పవన్ కళ్యాణ్ సూర్యని పక్కన పెట్టేసి కాటమరాయుడు మూవీకి డైరెక్టర్ గా డాలీ తీసుకున్నారట. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయితే సూర్య తన సినిమాని కాదని మరో సినిమాలో చేయడం కారణంగా పవన్ కళ్యాణ్ కి ఎస్ జె. సూర్యకి మధ్య చిన్నపాటి గ్యాప్ ఏర్పడిందట.


దాంతో వీరిద్దరు కొద్దిరోజులు మాట్లాడుకోలేదట.కానీ ఆ తర్వాత మళ్లీ వీరి మధ్య మాటలు కలిసాయి. రీసెంట్ గా సరిపోదా శనివారం మూవీలో నటించి హీరో నాని కంటే ఎక్కువ హైలైట్ అయ్యారు ఎస్. జే.సూర్య.. దాంతో మహేష్ బాబు సినిమా వల్ల ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ కి దూరమయ్యారనే మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారడంతో కొంతమంది  నెటిజన్స్ ఎస్. జే. సూర్యని మహేష్ బాబు తన సినిమాలో తీసుకొని పవన్ కళ్యాణ్ సూర్య మధ్య దూరం పెంచారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: