గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో వరదలు భారీగా వచ్చాయి. అలా భారీగా వరదలు రావడం వల్ల ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోగా , మరెంతో మంది అనేక ఆస్తులను కోల్పోయారు. అలాగే ప్రభుత్వ ఆస్తులు కూడా ఎన్నో ధ్వంసం అయ్యాయి. వరదల ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండడంతో ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన ఎంతో మంది హీరోలు తమకు తోచినంత ఆర్థిక సహాయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చారు.

అలాగే సినీ పరిశ్రమకు సంబంధించిన కొంత మంది హీరోయిన్లు , టెక్నీషియన్స్ , నిర్మాణ సంస్థలు కూడా వారికి తోచినంత సహాయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు చేశాయి. ఇకపోతే తాజాగా తమిళ నటుడు అయినటువంటి శింబు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వరదలు వచ్చి ప్రజలకు ఎన్నో కష్టాలు ఎదురైన కారణంగా కొంత మొత్తాన్ని రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు విరాళంగా ప్రకటించాడు. తాజాగా శింబు ఆరు లక్షల రూపాయలను ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేశాడు.

ఇలా తమిళ నటుడు అయిన కూడా తెలుగు ప్రాంతాలలో వరదల ద్వారా ప్రజలు సమస్యలను ఎదుర్కొంటూ ఉండడంతో పెద్ద మనసుతో ఈయన ఆరు లక్షల రూపాయలను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేశాడు. ఇలా శంబు తనకు తోచినంత విరాళాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు ఇవ్వడంతో ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇకపోతే శింబు నటించిన అనేక సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి విజయాలు సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: