బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిగానే కాకుండా ఇప్పుడు ఎంపీగా కూడా పేరు సంపాదించింది. అయితే ఈమె నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ.. ఈ సినిమా 1975 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. స్వయంగా ఈ చిత్రాన్ని  కంగనా రనౌత్ తెరకెక్కిస్తూ ఉండగా ఈమె ఇందులో నటిస్తోంది. ఇందులో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది. కానీ ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని వివాదాలు వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు.


దీంతో మళ్లీ ఎమర్జెన్ సినిమా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబైలోని బాంద్రాలో తన లగ్జరీ హౌస్ని సైతం రూ.30 కోట్లకు పైగా విక్రయించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం బాలీవుడ్ లో చాలా వైరల్ గా మారుతున్నది. 2017 లో రూ .20 కోట్లకు కొనుగోలు చేయగా ఇప్పుడు అమ్మేయడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.3,075 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 565 చదరపు అడుగుల ఖాళీ స్థలం  కలిగి ఉన్నది. ఈ భవనాన్ని తమిళనాడు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఇందుకోసం రూ 2 కోట్ల రూపాయలు స్టాంపు డ్యూటీ కట్టడమే కాకుండా రూ .30 వేల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇంకా కంగనా ప్రకటించలేం లేదు. కానీ ఇంటి స్థలం మొదటి నుంచి కూడా వివాదంలో ఉన్నది. ఈ భవనం 2020 మున్సిపల్ కార్పొరేషన్ కొంత భాగాన్ని కూల్చారట. ఈ ఇంటిని అక్రమంగా నిర్మిస్తున్నారనే విధంగా ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే కంగనా రనౌత్ ఈ ఇంటిని కూల్చడం వెనక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని విధంగా ఈమె ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎమర్జెన్సీ సినిమాపై సిక్కుల సంఘం కూడా చాలా వ్యతిరేకత చూపిస్తోందట. మరి ఇన్ని ఇబ్బందులు నడుమ కంగనా ఈ సినిమాని రిలీజ్ చేస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: