తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా తన హవాను కొనసాగిస్తున్న హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతితక్కువ సమయంలోనే ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్న కింగ్ నాగార్జున మన్మధుడిగా మంచి పేరును తెచ్చుకున్నాడు. టీనేజ్ వయసు నుంచి ఆరుపదుల వయసులోనూ తన సత్తాను చాటుతున్నారు.


ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తూ ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తున్న నాగార్జున రెండేళ్ల వయసులోనే వెలుగునీడలు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి... ఆ తర్వాత సుడిగుండాలు చిత్రంలో నటించారు. ఈ క్రమంలోనే 1986లో విక్రమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి వెనుతిరిగి చూడకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే..అక్కినేని నాగార్జునకు చుక్కలు చూపించిందట ఓ సీనియర్‌ హీరోయిన్..ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  


ఇదిలా ఉండగా.... ఒకానొక సమయంలో నాగార్జున స్టార్ హీరోయిన్ శ్రీదేవితో కలిసి నటించడానికి భయపడి పోయేవారట. ఎందుకంటే నటన పరంగా శ్రీదేవి సీనియర్ హీరోయిన్. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణా వంటి అగ్ర హీరోల సరసన శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. అలాంటి స్టార్ హీరోయిన్ తో సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి శ్రీదేవితో కలిసి సినిమా చేయడానికి నాగార్జున విపరీతంగా భయపడిపోయాడట.


శ్రీదేవితో కలిసి సినిమాలు చేయడం అతను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇక ఆమెతో కలిసి నాగార్జున సినిమాల్లో నటించారు. సమయం గడుస్తున్నా కొద్దీ నాగార్జునలో భయం తగ్గిపోయి ఇక ఆఖరి పోరాటం సినిమాలో నటించారు. ఆ తర్వాత నాగార్జున, శ్రీదేవి కాంబినేషన్లో రామ్ గోపాల్ వర్మ గోవింద గోవింద సినిమాను తీశారు. అంత పెద్ద హీరోకు శ్రీదేవి చుక్కలు చుక్కలు చూపించిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: