ఇండస్ట్రీలో హిట్టు ఇచ్చిన డైరెక్టర్స్, హీరోల దగ్గరకే నిర్మాతలు క్యూ కడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకులు చాలా మందే ఉన్నారు. కానీ.. అందులో మెుదటి వరుసలో ఉన్నది మాత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. గతం లో విజయ్ దేవరకొండ తో ‘లైగర్’ తీయగా.. అది నిరాశ పరిచింది. ఇక ఇటీవలే రామ్ పోతినేనితో తీసిన ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ పూరికి కచ్చితంగా కావాలి. ఈ నేపథ్యంలో తన నెక్ట్స్ మూవీ ఎవరితో తీస్తాడా? అంటూ అందరూ ఆసక్తికంగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ హీరో పేరు తెరపైకి వచ్చింది.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన తదుపరి సినిమాను హీరో గోపీచంద్ చేసే అవకాశాలున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘గోలీమార్’ మూవీ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి వీరిద్దరి కాంబో సెట్ అయినట్లు తెలుస్తుంది. మళ్లీ వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతోందని తెలియడంతో.. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. గోలీమార్ తో గోపీచంద్ లో ఉన్న మాస్ ను బయటకి తీసిన పూరి.. ఇప్పుడు ఏ రేంజ్ లో చూపిస్తాడా? అని అభిమానులు ఊహించుకుంటున్నారు. మరి ఈ కాంబో సెట్ అవుతుందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం గోపీచంద్ ‘విశ్వం’ అనే మూవీలో నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ మూవీకి డైరెక్టర్ కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయ స్టూడియో బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వేణు దొనేపూడి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: