-  ట్రైల‌ర్ రిలీజ్ కాకుండానే 1 మిలియ‌న్ మార్క్ క్రాస్ చేసేసిన దేవ‌ర‌

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న దేవర తొలిభాగం ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో పాన్‌ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది. ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ చాలా కసితో దేవర సినిమాను తెరకెక్కిస్తున్నారు.


నందమూరి కళ్యాణ్ రామ్‌తో పాటు.. కొరటాల శివ‌ సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు సైఫ్ అలీఖాన్ , మ‌రో సీనియ‌ర్ హీరో బాబీ డియోల్ ఇద్దరు దేవర సినిమాలో విలన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా పై కనీవినీ ఎర‌గ‌ని రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న దేవర.. ఫ్రీ బుకింగ్ సేల్స్ లో అదరగొడుతుంది.


దేవర ఫ్రీ బుకింగ్ సేల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.. ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు. ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే ఈ సినిమా ఫ్రీ బుకింగ్ సేల్స్ లో ఏకంగా 1 మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమాకు లేని అరుదైన రికార్డు దేవర ఖాతాలో పడింది. దీనిని బట్టి ఎన్టీఆర్ మానియా , ఎన్టీఆర్ చరిష్మా .. నార్త్ అమెరికాలో ఏ రేంజ్ లో ఉన్నాయో ? చెప్పేందుకు ఇది పెద్ద నిదర్శనంగా చెప్పాలి. అనిరుధ్ ర‌విచంద్రన్ సంగీతం అందిస్తున్న దేవర.. సముద్ర జలాలు నేపథ్యంలో తెరకెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: