హీరోయిన్ రెజీనా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. ఇక ఆ సినిమాలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించాడు. వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగుంది. ప్రస్తుతం రాజీనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఉత్సవం' అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన ఈ తెలుగు డ్రామా చిత్రాన్ని హర్న్ బిల్ పిక్చర్స్ పై సురేష్ పాటిల్ నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇందులో నుంచి ఇప్పటివరకు రిలీజైన టీజర్, ట్రైలర్ తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక సెప్టెంబర్ 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో...ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఈ మేరకు తాజాగా హీరోయిన్ రెజీనా కసాండ్రా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. 'డైరెక్టర్ అర్జున్ సాయి ఈ కథ నెరేటివ్ చేసినప్పుడు వెరీ బ్యూటిఫుల్ గా అనిపించింది. ఈ కథలో సోల్ ఉంది. నాటక రంగం గురించి ఆయన చాలా రీసెర్చ్ చేసి ఈ కథని రాసుకున్నారు. ఆడియన్స్ ను థియేటర్స్ కి తీసుకురావటానికి ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో తెలిసిన డైరెక్టర్. చాలా అద్భుతమైన నటులు ఇందులో ఉన్నారు.

ఇందులో నేను కార్పోరేట్ ఎంప్లాయ్‌గా కనిపిస్తాను. నాకు లవ్ మీద పెద్ద ఇంప్రెషన్ ఉండదు. చాలా ఇండిపెండెంట్. నా క్యారెక్టర్ ఇండిపెండెంట్ విమెన్ రిలీట్ చేసుకునేలా ఉంటుంది. కథలో చాలా కీలకంగా ఉంటుంది. క్యారెక్టర్ చేయటం చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఇక హీరో దిలిప్ హార్డ్ వర్క్ యాక్టర్. చాలా పాజిటివ్ సోల్. ఇప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తనతో వర్క్ చేయటం చాలా ఎంజాయ్ చేశాను. తనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరూ చాలా సిన్సియర్ గా వర్క్ చేశారు. ప్రకాష్ రాజ్, నాజరుతో వర్క్ చేయటం చాలా ఎంజాయ్ చేశాను. చాలా నేర్చుకున్నాను' అని చెప్పుకొస్తూ..తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల గురించి మాట్లాడుతూ..'గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ సినిమా చేస్తున్నాను. హిందీలో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి మేకర్స్ అనౌన్స్ చేశారు' అంటూ తెలిపింది రాజీనా.

మరింత సమాచారం తెలుసుకోండి: