పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిశ్రమ అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం గా చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. మెగా డాటర్ నిహారిక గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిహారిక రీసెంట్గా కమిటీ కుర్రాళ్ళు మూవీకి డైరెక్టర్ గా చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ అయిపోయారు.రెండు తెలుగు రాష్ట్రాలను ఇటీవల ముంచుకొచ్చిన వరదలు అతలాకుతలం చేశాయి.

 ఈ వరదల కారణం గా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితుల సహాయర్థం ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో పాటు పలువురు యంగ్ హీరోలు కూడా విరాళాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే నిహారిక కూడా తన వంతు సాయం చేస్తూ.. బుడమేరు ముంపునకు గురైన 10 గ్రామాలకు ఒక్కో దానికి రూ.50 వేలు చొప్పున రూ.5 లక్షల విరాళాన్ని పవన్ కళ్యాణ్ స్పర్తితొ ప్రకటించింది. ఐదే, తాజాగా నిహారికను అభినందిస్తూ పవన్ కళ్యాణ్ ఓ పోస్ట్ పెట్టారు.

 'ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను అందుకునేందుకు ముందుకొచ్చి ఒక్కో గ్రామానికి రూ.50 వేలు చప్పున రూ.5 లక్షల విరాళమిచ్చిన నిహారిక కు అభినందనలు తెలుపుతున్న. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి సంకల్పంతో సాయం చేసేందుకు ముందుకు రావడం సంతోషాన్నిచ్చింది. ఇటీవలే పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా 'కమిటీ కుర్రోళ్ళు' నిర్మాతగా విజయం సాధించిన నిహారిక భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాను' అని పవన్ తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్ ఇంటా వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు. నిహారిక సాయానికి మెచ్చుకుంటున్నారు ప్రజలు. ఇక అలాగే పవన్ కళ్యాణ్ కూడా తనకి తోచిన సహాయం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: